స్కిల్ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంపై టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. “సత్యం గెలిచింది.. అసత్యంపై యుద్ధం ఆరంభం. మన నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యమే. చంద్రబాబు నీతి, నిజాయతీ, వ్యక్తిత్వం తలెత్తుకుని నిలబడింది. 50 రోజులైనా ఒక్క ఆధారమూ కోర్టు ముందు ఉంచలేకపోయారు. కుట్రలు, కుతంత్రాలు న్యాయం ముందు బద్ధలయ్యాయి. చంద్రబాబు రాజకీయ జీవితంపై మచ్చ వేసేందుకు కుట్రని తేలింది.” అని లోకేశ్ పేర్కొన్నారు.