ఎస్బీఐ బ్యాంకుకు చెందిన ఒక ఏటీఎం నుంచి కస్టమర్లు తమ డెబిట్ కార్డుల ద్వారా విత్డ్రా చేసే నగదు వారి ఖాతాల నుంచికాకుండా బ్యాంకు చెస్ట్ ఖాతా నుంచి డెబిట్ కావడంతో అధికారులు సిటీ సైబర్క్రైమ్స్లో శనివారం ఫిర్యాదు చేశారని ఏసీపీ కేవీఎం.ప్రసాద్ తెలిపారు. బ్యాంకు సాఫ్ట్వేర్ చెక్ చేయించినప్పటికీ ఎలాంటి లోపాలూ లేకపోవడంతో కేటుగాళ్లు సాఫ్ట్వేర్ను హ్యాక్ చేసి బ్యాంకు చెస్ట్ ఖాతా నుంచి డబ్బులను ఏదైనా ఖాతాల్లోకి మళ్లిస్తున్నారా? అనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.