ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశం

కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బుధవారం కేంద్రమంత్రివర్గం సమావేశం కానుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వర్చువల్‌ విధానంలోనే సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా దేశంలోని పరిస్థితులతో మంత్రులతో ప్రధాని చర్చించనున్నారు. ప్రధానంగా రోడ్డు రవాణా, పౌర విమానాయశాఖ, టెలీకాం మంత్రిత్వశాఖలు చేపట్టిన పనులపై సమీక్షించనున్నట్లు సమాచారం. కాగా, ఇటీవల మోదీ వరుసగా కేంద్ర మంత్రులతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో త్వరలో కేంద్రమంత్రివర్గ మార్పులు, చేర్పులుంటాయని ఊహాగానాలున్నాయి.

ఈ క్రమంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్‌డీఏ కూటమి నుంచి శివసేన, శిరోమణి అకాలీదళ్‌ వైదొలగడంతో రెండు కేంద్ర మంత్రి పదవులు, లోక్‌జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌, మరో కేంద్రమంత్రి సురేష్‌ అంగడి మృతితో మరో రెండు మంత్రి పదవులు ఖాళీగా అయ్యాయి. ఆయాశాఖలను ఇతర మంత్రులకు కేటాయించారు. అదనపు భారంతో మంత్రులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేబినెట్‌ పునర్యవస్థీకరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. వరుణ్‌ గాంధీ, జ్యోతిరాధిత్య సింధియాతో పాటు మరో ఇద్దరిని కేబినెట్‌లోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *