48 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం

J6@Times//చెన్నై సహా 10 జిల్లాల్లో 48 గంటల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ పరిశోధన కేంద్రం తెలియజేసింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో, నైరుతి రుతుపవనాల ప్రభావంతో పశ్చిమ కనుమల సరిహద్దు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రానున్న 48 గంటల్లో చెన్నై, తిరువళ్లూర్‌, తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, పుదుచ్చేరి, ఈరోడ్‌, సేలం, ధర్మపురి, కృష్ణగిరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షం కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలియజేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *