దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా పామిడి పట్టణంలో వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలోని వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, అనంతరం పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, పావలా వడ్డీ వంటి పథకాల ద్వారా పేదలు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరిగిందని పేర్కొన్నారు.
ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నాయకులు అన్నారు. అలాంటి మహనీయుడు మన మధ్య లేకపోవడం బాధాకరమని పేర్కొంటూ ఆయన సేవలను స్మరించుకున్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగించేందుకు కృషి చేస్తామని తెలిపారు.