ఐపీఎల్‌ తొలివారం వీక్షకులు 37 కోట్ల మంది

ఐపీఎల్‌ తొలివారం వీక్షకులు 37 కోట్ల మంది


న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకం గా చెప్పన క్కర్లేదు. టెక్నాలజీ, స్మార్ట్‌ఫోన్ల ప్రభావంతో ఈసారి వీక్షకుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలిసింది. ఇప్పటివరకూ ఐపీఎల్‌ను టీవీ, ఆన్‌లైన్‌లో చూసిన వీక్షకుల సంఖ్య 37 కోట్ల 10 లక్షలకు (371 మిలియన్లు) చేరుకోవడంతో కొత్త రికార్డు నమోదైందని బార్క్‌ (బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రీసర్చ్‌ కౌన్సిల్‌ ఇండియా) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. టీవీల ద్వారా 288.4 మిలియన్లు, హాట్‌స్టార్‌ ద్వారా 82.4 మిలియన్ల అభిమానులు ఐపీఎల్‌ను వీక్షించినట్లు స్పష్టం చేసింది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి 76 శాతం మంది అధికంగా ఐపిఎల్‌ మ్యాచ్‌లను చూశారు. మరొకవైపు ఓవరాల్‌ లీగ్‌ చరిత్రలో మొదటి వారంలో ఐపీఎల్‌ను వీక్షించిన వారి సంఖ్యలో కూడా ఇదే అత్యుత్తమంగా నమోదైంది. దక్షిణ భారతదేశంలో ఈసారి 30శాతం టీవీ వీక్షకుల సంఖ్య పెరిగినట్లు బార్క్‌ స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *