ఈసీ కీలక నిర్ణయం.. ఆ రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీలు మార్పు..

అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో కౌంటింగ్ తేదీని మారుస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన జూన్ 4న కాకుండా జూన్ 2న కౌంటింగ్ చేపటనున్నట్లు ఈసీ ఆదివారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి.

 

ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కీం రాష్ట్రాల్లో శాసన సభల పదవీకాలం జూన్ 2తో ముగుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *