దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ విడుదల చేస్తోంది. ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ప్లీనర్ హాల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు సుఖ్ బీర్ సింగ్, జ్ఞానేశ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటిస్తున్నారు.
రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీలను ప్రకటిస్తున్నారు. దేశంలో 97 కోట్ల ఓటర్లు ఉన్నారని తెలిపారు. 55 లక్షల ఈవీఎంలు సిద్ధం చేశామన్నారు. 10 లక్షల 50 వేల పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని చెప్పారు. కోటిన్నర మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారని వెల్లడించారు.
పురుష ఓటర్లు..49.7 కోట్లు
మహిళా ఓటర్లు..47.1 కోట్లు
1.8 కోట్ల మంది ఫస్ట్ టైమ్ ఓటర్లు
85 ఏళ్లు దాటిన వారు 82 లక్షల మంది
ట్రాన్స్ జెండర్స్.. 48 వేల మంది
యంగ్ ఓటర్లు..19.74 కోట్లు
వందేళ్లు దాటిన వారు 2.18 లక్షల మంది
సర్వీస్ ఓటర్లు 19.1 లక్షల మంది
దివ్యాంగ ఓటర్లు 88. 4 లక్షల మంది
జమ్మూకాశ్మీర్ లో కూడా ఎన్నికల నిర్వహించాలని రాజీవ్ కుమార్ తెలిపారు. జూన్ 16లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని ప్రకటించారు. చిన్న పిల్లలను ఎన్నికల ప్రచారంలో
ఉపయోగించకూడదని స్పష్టం చేశారు.
లోక్ సభ ఎన్నికలు పలు విడతల్లో జరపనున్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ , ఒడిశా, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల షెడ్యూల్ ను కూడా ప్రకటిస్తారు.
ప్రస్తుతం లోక్ సభ గడువు జూన్ 16తో ముగియనుంది. అలాగే నాలుగు రాష్ట్రాల్లో మేలో ఎన్నికలు నిర్వహించాలి. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికలసంఘం అధికారులు.. ఎన్నికలకు క్షేత్రస్థాయిలో సన్నద్ధం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు సూచనలు చేశారు