కార్మికులపై ఉగ్రవాదులు కాల్పులు.. ఒకరి మృతి..!

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పంజాబ్ కార్మికులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. హబ్బా కడల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడు అమృత్‌సర్‌కు చెందిన అమృత్‌పాల్ సింగ్‌గా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రుడు రోహిత్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు, బలగాలు ఆ ప్రాంతంలో భద్రతా చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *