కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం.. ఇద్దరు మృతి..

కర్ణాటకను మంకీ ఫీవర్ వణికిస్తోంది. రాష్ట్రంలో మంకీ ఫీవర్‌తో ఇద్దరు కన్నుమూయడం కలకలం రేపుతోంది. శివమొగ్గ జిల్లా హొసనగర తాలుకాకు చెందిన యువతి (18), ఉడుపి జిల్లా మణిపాల్‌కు చెందిన ఓ వృద్ధుడు (79) ఈ వైరస్‌తో మృతిచెందారు. ఇక మొత్తంగా ఉత్తర కన్నడలో 34, శివమొగ్గలో 12, చిక్కమగళూరులో 3 కేసులను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. కీటకాలు కోతులను కుట్టిన తర్వాత తిరిగి మనిషిని కుడితే ఈ వైరస్ వస్తుందని వారు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *