తెలంగాణలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల పునరుద్ధరణకు వెంటనే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించాలని కేబినెట్ సబ్ కమిటీకి సూచించారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. బోధన్, ముత్యంపేటల్లో మూతపడ్డ కర్మాగారాల బకాయిలు, ఆర్థిక ఇబ్బందులపై సీఎం ఆరా తీశారు. ఆయా ప్రాంతాల్లోని చెరకు రైతుల అవసరాలపై సమగ్రంగా చర్చించారు. తగు సలహాలు, సూచనలతో నివేదిక అందించాలని సూచించారు.