సోలార్ రూఫ్టాప్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకం కింద సోలార్ ప్యానెళ్లకు సబ్సిడీని 40 శాతం నుంచి 60 శాతానికి పెంచనున్నట్లు తెలిపింది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఈ విషయాన్ని తాజాగా ప్రకటించారు. ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకాన్ని ప్రధాని మోడీ ఇటీవలే ప్రకటించారు. ఇందులో భాగంగా దేశంలో కోటి ఇళ్లకు సోలార్ రూఫ్టాప్లు అందించనున్నారు.