30ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో పూజలు….

జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతిచ్చింది. వారంలోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఇవాళ ఉదయం భక్తుల కోలాహలం నడుమ జ్ఞానవాపీ దగ్గర పూజలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే బేస్‌మెంట్‌లో అర్చకులు మందిరాన్ని శుభ్రం చేసి, శివలింగానికి పూజలు చేయడం ప్రారంభించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *