నేడు లేదా రేపు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ HYDలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై కసరత్తు చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. త్వరలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4వరకు ‘రా..కదలి రా’ సభలకు విరామం ప్రకటించారు.