ఏపీలోనూ ఉచిత బస్సు, రైతు రుణమాఫీ..?

ఏపీలో నేడు జరిగే ఏపీ మంత్రివర్గ సమావేశం కీలకంగా మారుతోంది. ఎన్నికల వేళ జగన్ సర్కార్ కొత్త నిర్ణయాల ప్రకటించనుంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన తుది నిర్ణయం తీసుకొనే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ పథకంపైన ఆర్టీసీ అధికారులు అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. అలాగే రైతులకు రుణమాఫీ దిశగా కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *