కొన్ని బ్లడ్ బ్యాంకులు, ఆసుపత్రుల్లో రోగులకు అవసరమైన రక్తాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో.. వీటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రక్తం కోసం వసూలు చేసే అన్ని రకాల రుసుములను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించారు. ‘రక్తం అమ్మకానికి లేదు’ అనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రులు, బ్లడ్ బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని కేంద్రం సూచించింది.