నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు ఇస్తామని తెలిపారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే తమ ప్రభుత్వానికి పేరు వస్తుందని.. ఉగాది నాటికి నంది అవార్డులు ఇచ్చేలా పరిశీలిస్తామని చెప్పారు. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామన్న ఆయన.. సీఎంతో చర్చించిన తర్వాత సినీపెద్దలను ఆహ్వానిస్తామని అన్నారు.