ఆంధ్రప్రదేశ్ లో ఓటు బ్యాంకును తిరిగి దక్కించుకునే దిశగా కాంగ్రెస్ ప్రయత్నాలు ప్రారంభించింది. బుధవారం ఏపీసీసీ పెద్దలతో ఢిల్లీలో అధిష్ఠానం భేటీ కానుంది. ఎపి నుంచి 30 మంది కాంగ్రెస్ నేతలు బయలుదేరారు. వారితో రాహుల్ సమావేశం కానున్నారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, కొత్త వారిని చేర్చుకునే అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.