ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. ఆయనకు ఎక్స్లో 94 మిలియన్లు, ఫేస్బుక్లో 48 మిలియన్లు, 82.7మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ప్రపంచంలో మరే నేతకు ఈ స్థాయిలో ఫాలోవర్లు లేరు. తాజాగా యూట్యూబ్లో ఆయన చానల్ను సబ్ స్క్రైబ్ చేసుకున్న వారి సంఖ్య 2కోట్ల మార్కును చేరుకుంది. తద్వారా యూట్యూబ్లో 2 కోట్ల సబ్ స్క్రైబర్లను పొందిన తొలి ప్రపంచనేతగా మోదీ చరిత్ర సృష్టించారు.