చేయూత పథకం కింద రూ.4,000 పెన్షన్, దివ్యాంగులకు రూ.6,000 పెన్షన్ అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పెన్షన్ కోసం రేపటి నుంచి నిర్వహించే ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు, ప్రజాభవన్ దరఖాస్తు ఫారం సమర్పించిన వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు.