3,420కి చేరిన క‌రోనా వైర‌స్ కేసులు..

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఆందోళ‌న క‌లిగిస్తోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 423 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ప్ర‌భుత్వం వెల్లడించింది. అలాగే న‌లుగురు మ‌ర‌ణించార‌ని తెలిపింది. నిన్న అత్యధికంగా కేర‌ళ రాష్ట్రంలో 266 కేసులు న‌మోదు కాగా.. ఏపీలో 8, తెలంగాణ‌లో 9 మందికి క‌రోనా సోకింది. తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,420కి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *