ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్ట్‌ల మృతి..

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా గోగుండా అటవీ ప్రాంతంలో మావోయిస్ట్‌లకు.. భద్రత బలగాలకు ఎదురు కాల్పులు జరిగాయి. భద్రత బలగాలు కూంబింగ్ చేస్తుండగా వారికి మావోయిస్ట్‌లు తారసపడ్డారు. దీంతో భద్రత బలగాలపై ఒక్కసారిగా మావోయిస్ట్‌లు కాల్పులకు దిగారు. దీంతో భద్రత బలగాలు ఎదురుదాడి చేశాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్ట్ లు మృతి చెందారు. మావోయిస్ట్ లు మృతి చెందిన విషయాన్ని సూక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

ఘటనా స్థలంలో మరికొంత మంది మావోయిస్ట్‌లు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారిని భద్రతా బలగాలు చుట్టుముట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సీఆర్ఫీఎఫ్ డీఐజీ అరవింద్ రాయ్ తెలిపారు. సుక్మా డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్, దంతెవాడ డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్ , సీఆర్పీఎఫ్ 2వ బెటాలియన్, సీఆర్పీఎఫ్ 111వ బెటాలియన్‌లు కలిసి కూంబింగ్ చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *