పూంచ్ లో ఉగ్ర దాడి.. ముగ్గురు జవాన్లు మృతి

జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు తెగబడ్డారు. రాజౌరిలోని పూంచ్ ప్రాంతంలో ఉన్న డేరా కీ గలీ నుంచి వెళ్తున్న రెండు ఆర్మీ ట్రక్కులపై సైనికులే లక్ష్యంగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. కాగా ఇంటెలిజెన్సీ పక్కా సమాచారంతో డీకేజీ ప్రాంతంలో బుధవారం రాత్రి నుంచి భారత సైన్యం ఆపరేషన్ చేపడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *