మరో బిగ్ బాంబ్ పేల్చిన కల్వకుంట్ల కవిత..?

తాను పెట్టబోయే పార్టీ ఎజెండా మాజీ మావోయిస్టుల ఆలోచనకు దగ్గరగా ఉంటుందని.. వారు కూడా తమపార్టీలో చేరే అవకాశం ఉందని, వారిది మాది ఒకే ఎజెండా అని, అందుకు కొంత సమయం పడుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు.

 

బీఆర్ఎస్ బుజాన తూపాకి..

బీఅర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తానన్నారు. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు తిట్టుకోవడానికే సమయం సరిపోయిందని, ఒకరిఅవినీతిని ఒకరు బయటపెట్టుకున్నారని అన్నారు. బీఆర్ఎస్ బుజాన తూపాకి పెట్టి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ని కాల్చారన్నారు. మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని, ఆ వాటా కోసం పోరాటం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేను రాముడు, మాజీ సీఎం కేసీఆర్ రావణుడు అయితే శకుని ఎవరు..? అని నిలదీశారు. కల్వకుర్తి నియోజక వర్గం లో కుర్మిద్దలో పెద్ద భూస్వాముల భూములు వదిలి పేద గిరిజనుల భూములను టీజీఐసీసీ గుంజుకుంటుందని ఆరోపించారు.

 

1500 ఎకరాల భూమి..

ఐదుగురు భూస్వాములకు చెందిన 1500 ఎకరాల భూమిని తిరిగి ఇచ్చి.. పేదలకు చెందిన 350 ఎకరాలపై పైగా భూమిని మాత్రం ప్రీజ్ చేసి టీజీఐసీసీ తీసుకుందన్నవారు. త్వరలో వారికోసం వెల్లి పోరాటం చేస్తామన్నారు. అదే విధంగా నాదర్ గుల్ లో సైతం బాధితులు వచ్చి తనను కలుస్తున్నారని వారిపక్షాన నిలబడతానన్నారు. పార్టీ ఆవిర్భావం రోజు ఎజెండా చెప్పేందుకే ప్రాధాన్యం ఇస్తానన్నారు. మాజీ సీఎం ఉమా భారతి సహా ఇతర పెద్దల ఆశీర్వాదం తీసుకుంటానని స్పష్టం చేశారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *