మేదపల్లిలో ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్డు పనుల ప్రారంభం.

తేది:22-03- 2026 సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం TSLAW NEWS రిపోర్టర్ ఫయాజ్ షరీఫ్.

సంగారెడ్డి జిల్లా: ఝరాసంగం మండలం ​మేదపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రమంలో బి సి కాలని లో సర్పంచ్ కొల్లూరు అరుణ నరేందర్ రెడ్డి శాస్త్రోక్తంగా పూజలు చేసి, ముహూర్తం నిశ్చయించి ప్రారంభించారు.
​ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ యువ నాయకులు అశ్విన్ పాటిల్, అభిలాష్ రెడ్డి గ్రామ ఉపసర్పంచ్ మజర్ అహ్మద్, మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి, యకూబ్ షరీఫ్ వార్డు సభ్యులు మరియు గ్రామ యువ నాయకులు శేఖర్,దిలీప్, లక్ష్మణ్, భాగప్ప, అజార్ అహ్మద్, ఖైరు పాటిల్
​ శ్రీనివాస్, పరమేష్‌తో పాటు గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
​గ్రామస్తుల సౌకర్యార్థం నాణ్యతతో కూడిన రోడ్ల నిర్మాణమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *