తేది:02-03-2026 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా ప్రజలకు హోళీ పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
రంగుల పండుగ హోళీ సమాజంలో ఐక్యత, స్నేహభావం మరియు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే గొప్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో, శాంతి వాతావరణంలో పండుగను జరుపుకోవాలని, ప్రతిఒక్కరి జీవితం రంగుల హరివిల్లు కావాలని ఆకాంక్షించారు.
హోళీ వేడుకలను నిర్వహించేటప్పుడు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. హానికర రసాయన రంగులను ఉపయోగించకుండా సహజ రంగులతో పండుగను జరుపుకోవాలని తెలిపారు.
ఈ హోళీ పండగను జరుపుకునేటప్పుడు చిన్న పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నీటి వృథాను నివారిస్తూ, పర్యావరణాన్ని కాపాడే విధంగా పండుగను నిర్వహించాలని కోరారు. ఇతరులకు ఇబ్బంది కలుగకుండా ప్రజలు పరస్పరం గౌరవభావంతో మెలగాలని విజ్ఞప్తి చేశారు.
ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో ఉండేవిధంగా హోళీ పండుగను ఆనందంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.