గతంలో ఏపీ పాలకులకంటే తెలంగాణ కాంగ్రెస్ నేతలే ఎక్కువ ముంచారని సీఎం కేసీఆర్ విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ కాలంలో జగిత్యాలను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారని గుర్తుచేశారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనకు తేడా ఏంటో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు