ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష రంగం వేగవంతమైన అభివృద్ధికి నియంత్రణ చాలా ముఖ్యమైందన్నారు. భారతదేశ తొలి సౌండింగ్ రాకెట్ ప్రయోగం 60వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అంతరిక్ష విజ్ఞాన ప్రపంచంలో భారతదేశం గణనీయమైన ప్రగతిని సాధించిందన్నారు. ప్రైవేటు రంగం సహకారంతో భారత్ ఉపగ్రహాల తయారీ సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందన్నారు.