సూర్యుడిపై అధ్యయనం జరిపేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా ఆదిత్య ఎల్-1 ప్రయోగాన్ని చేపట్టింది. త్వరలోనే ఆదిత్య ఎల్-1 తన లక్ష్యాన్ని చేరుకోనుంది. ఈ విషయాన్ని ఇస్రో చీఫ్ సోమ్నాథ్ శనివారం వెల్లడించారు. సరైన మార్గంలోనే ఆదిత్య ప్రయాణిస్తోందని, జనవరి 7న తుది విన్యాసాన్ని చేపట్టి ఎల్-1 పాయింట్లోకి ప్రవేశపెడతామన్నారు.