బిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. కామారెడ్డి సభలో మోదీ పాల్గొని మాట్లాడారు. బిఆర్ఎస్ నేతలకు డబ్బు కావాలంటే కొత్తగా ప్రాజెక్టులు నిర్మిస్తారు. రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం తీసుకొచ్చాం. రైతుల ఖాతాల్లో రూ.2.75 లక్షల కోట్లు జమ చేశాం. రైతులకు రూ.300కే యూరియా బస్తా సరఫరా చేస్తున్నాం.” అని మోదీ పేర్కొన్నారు.