సోనియా గాంధీకి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌ను ఆమెకు అందజేసి, రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీకి వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తెలిపింది.

‘తెలంగాణ రైజింగ్-2047’ విజన్ డాక్యుమెంట్ ముఖ్య లక్ష్యం, రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం. దీనిలో భాగంగా, 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవాలని నిర్దేశించుకున్నారు. ఈ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రాన్ని క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ), ప్యూర్ (పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ), రేర్ (రూరల్ అగ్రి రీజియన్ ఎకానమీ) అనే మూడు ప్రత్యేక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయనున్నారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధిపై రేవంత్ రెడ్డి దార్శనికతను సోనియా గాంధీ అభినందించారు. విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ వివరాలను కూడా సీఎం ఈ సమావేశంలో ఆమెకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *