కబ్జాకు గురైన రహదారిని పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలి- మల్లె తోటకు వ్యవసాయపనులకు వెళ్లే రైతుల మహాధర్నా.

తేదీ:10-12-2025 జగిత్యాల జిల్లా, TSLAWNEWS ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి.

 

మెట్పల్లి : ఈరోజు మెట్పల్లి పట్టణం వెల్లుల్ల రోడ్డు నుండి వ్యవసాయ పనులకు రైతులు మల్లె తోటకు పోవుటకు దారి అక్రమములకు గురి కావడంతో ఈరోజు రైతులు ధర్నా చేశారు ధర్నా అనంతరం పోలీసు అధికారులు వచ్చి ఎలక్షన్స్ ఉన్నందున తర్వాత మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు రైతులు మాట్లాడుతూ మల్లెతోటకు వ్యవసాయ పనులకు దాదాపు 300 రైతు కుటుంబాలకు దారి ఉండేదని దానిని కబ్జాకు గురవడంతో వ్యవసాయ పనులకు ఇబ్బంది కలుగుతుందని ఇటీవల collector,RDO,Mro,TPO,muncipal commissioner,Tpo ఎస్ ఆర్ ఎస్ పి కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వడం జరిగిందని కానీ ఇటీవల అక్రమంగా లింకు రోడ్డు కబ్జక్ గురైందని, ప్రవాహం లేని Srsp d32 ను రోడ్ గా అభివృద్ధి చేయాలి లేదా ,syno 1094 లో గల Meghana వెంచర్ లోని 40feet రోడ్ నుండి మల్లెతోట వరకు రోడ్ అభివృద్ధి చేసి రైతులకి రవాణా సౌకర్యం కలిగించాలి .దీనిని ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో రైతులు, రైతుల కుటుంబాలు ధర్నాలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *