అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ మధ్య దక్షిణ కొరియాలోని బుసాన్లో గురువారం సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది. ఇరు దేశాల మధ్య కొద్దికాలంగా నడుస్తున్న టారిఫ్ వార్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. జిన్పింగ్తో భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ చైనాకు గుడ్న్యూస్ చెబుతూ కీలక ప్రకటన చేశారు: చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఫెంటనిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేసేందుకు చైనా అధ్యక్షుడు తీవ్రంగా శ్రమిస్తారని భావిస్తున్నానని పేర్కొంటూ, అందుకే ఫెంటనిల్ పేరుతో చైనాపై విధించిన 20 శాతం సుంకాలను 10 శాతానికి తగ్గిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఈ తాజా తగ్గింపుతో చైనాపై మొత్తం టారిఫ్లు 57 శాతం నుంచి 47 శాతానికి దిగిరానున్నాయని తెలిపారు. ఇది రెండు దేశాల మధ్య వాణిజ్య ఒత్తిడిని కొంతవరకు తగ్గిస్తుంది.
జిన్పింగ్తో భేటీ అద్భుతంగా జరిగిందన్న ట్రంప్, పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. అమెరికా సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్లను చైనా తక్షణమే పునరుద్దరించేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు. అంతేకాకుండా, అరుదైన ఖనిజాలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని ట్రంప్ అన్నారు. మరింత చర్చల కోసం ఏప్రిల్ నెలలో తాను చైనా వెళతానని ట్రంప్ ప్రకటించారు.