ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త : ఏటీఎం వాడకపు సర్వీస్ ఛార్జీలు రద్దు

న్యూ ఢిల్లీ :  దేశీయ అతిపెద్ద  ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన కస్టమర్లకు  శుభవార్త చెప్పింది.  ఏటీఎం కార్డు లావాదేవీలపై సర్వీసు ఛార్జీలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది.  కరోనా విస్తరణ, లాక్ డౌన్,  కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. తాజా నిర్ణయం ప్రకారం ఎన్నిసార్లైనా డబ్బులను ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు ఖాతాదారులకు లభించింది.  వీటికి అదనంగా ఎలాంటి సర్వీస్ ఛార్జీలను వసూలు చేయబోమని  బ్యాంకు  తెలిపింది. అంతేకాదు  ఎస్ బీఐ ఏటీఎంలు మాత్రమే కాకుండా  ఏ ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు  డ్రా చేసినా ఎలాంటి ఛార్జీలు ఉండవని ప్రకటించింది. ఈ వెసులుబాటు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఉంటుందని ట్విటర్ వేదికగా ఎస్‌బీఐ ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *