స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ గారికి ఘనంగా సన్మానించిన-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్ మేనేజర్..

స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్యగౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ గారికి ఘనంగా సన్మానించిన-స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్ మేనేజర్.

స్వాతంత్ర సమరయోధుడు కుటుంబాన్ని గౌరవించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అభినందనలు తెలిపిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో స్వతంత్ర సమరయోధుడు కీర్తిశేషులు కోవూరి మొగులయ్య గౌడ్ సతీమణి కోవూరి మణెమ్మ గారికి ఫ్రీడమ్ ఫైటర్ పెన్షన్ సెల్ ఉత్తర్వుల మేరకు సదాశివపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా శాలువాతో, పండ్లతో సదాశివపేట బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గౌరవించి సన్మానించారు. ఈ సందర్భంలో స్వతంత్ర సమరయోధుడు కుటుంబాన్ని 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పునస్కరించుకొని గౌరవించి సన్మానించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సదాశివపేట బ్రాంచ్ మేనేజర్ గారికి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరియు స్వాతంత్ర సమరయోధుడి ఆశయాల కోసం నిరంతరం కృషి చేస్తూ పని చేస్తున్న, నాయకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అదేవిధంగా సంపూర్ణ మద్దతు తెలిపిన సదాశివపేట పట్టణ ప్రజా ప్రతినిధులకు ప్రత్యేకంగా ఆగస్టు15వ తేదీన జరుపుకొనబోయే 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు ముందుగా తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ముందు ముందుగా మంచి రోజులు వస్తాయని తెలియజేస్తూ ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా నిరంతరం పనిచేస్తుందని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో అడ్వకేట్ వై భగవంతరావుగౌడ్, శివకుమార్,చాకలి లక్ష్మయ్య, యాదమ్మ మరియు సదాశివపేట బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *