సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ ట్రయల్ రన్ ప్రారంభం..

భద్రాద్రి సీతారామ ప్రాజెక్టు 2, 3 లిఫ్ట్ ఇరిగేషన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 15న ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ -2ను ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పంప్ హౌస్ ట్రయల్ రన్ ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. పంద్రాగస్టు 15న రూ. 2 లక్షల రుణమాఫీని ప్రకటిస్తామని తెలిపారు. ఏటా 6 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నామన్నారు. 2026 ఆగస్టు 15 నాటికి ఆయకట్టులోని ప్రతి ఎకరానికి నీరిస్తామని ఆయన చెప్పారు.

 

రీడిజైన్ పేరుతో గత పాలకులు రూ. 8 వేల కోట్లు వృథా చేశారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ప్రాజెక్టు పనులు నత్తనడక సాగాయన్నారు. పంప్ హౌస్ ల పరిధిలో డిస్ట్రిబ్యూటరీ కాలువలు త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సత్తుపల్లి ట్రంక్ పనుల్లో యాతాలకుంట టన్నెల పూర్తి చేయాలని వారు చెప్పారు. జూలూరుపాడు టన్నెల్ పూర్తయితే పాలేరు వరకు గోదావరి జలాలు వస్తాయంటూ మంత్రి వివరించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *