ధ్యాన జగత్తును నిర్మిద్దాం, సమసమాజాన్ని కాపాడుదాం- బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, నర్సాపూర్ లో నిర్వహించిన శాఖాహార ర్యాలీ మరియు పిరమిడ్ ప్రారంభోత్సవ సభ కార్యక్రమానికి హాజరైన బిసివై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పత్రీజీ గారి ఆశయాల మేరకు పిరమిడ్ ధ్యానులందరూ శాకాహర జగత్, పిరమిడ్ జగత్, ధ్యాన జగత్ ను నిర్మించడానికి ముందుకు రావాలని కోరారు. అదేవిధంగా పిరమిడ్ ధ్యానము విలువ తెలిసిన నర్సాపూర్ చైర్ పర్సన్ అశోక్ గౌడ్ గారు, ఎక్స్ చైర్ పర్సన్ ప్రభాకర్ రెడ్డి గారు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ సాయ గౌడ్, సమావేశ ఆర్గనైజర్ దత్తు మాస్టర్, పిరమిడ్ సేవాదళ్ అధ్యక్షులు భూపతిరాజు మరియు మేధావులు, నాయకులు, కళాకారులు అందరికీ పేరుపేరునా ఆత్మీయ ప్రణామాలు తెలుపుతూ సెప్టెంబర్ 2న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిరమిడ్ ధ్యానులందరూ హాజరై ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టే ఫ్రీడమ్ ఫైటర్స్ ఏఎంస్ అండ్ ఆబ్జెక్టివ్స్ తో కూడుకున్న ఆశయాలను నెరవేర్చుటలో భాగంగా అందరూ పిరమిడ్ మాస్టర్లు తెలంగాణ నలుమూలల నుండి కదలి వచ్చి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు వెళ్దామని సభాముఖంగా తెలియజేశారు.ఈ యొక్క కార్యక్రమంలో సంగమేశ్వర్ మాస్టర్, శ్రీనివాస్ మాస్టర్, సంగీత మాస్టర్, సైదులు మాస్టర్, సాయిలు మాస్టర్, మీనా మాస్టర్, మంజుల మాస్టర్ మరియు ప్రముఖ ప్రముఖ పిరమిడ్ ధ్యాన మాస్టర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *