ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓ.ఎస్.డి ను ఆశ్రయించిన – బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్…

న్యూఢిల్లీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో ఓ.ఎస్.డి ని కలిసి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చడంలో 108 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి పత్రాన్ని అందజేసిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లా టిఎంఆర్పిఎస్ అధ్యక్షులు కొలుపుల రత్నయ్య, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెంట్ ఎంపీ సాయ గౌడ్. ఈ సందర్భంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ వినతి పత్రం ద్వారా ఆవేదనను వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధులు స్వతంత్ర ఉద్యమంలో ప్రాణ త్యాగాలు లెక్కచేయకుండా స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం అలుపెరుగని పోరాటం చేసిన వారి కళలను ఆశయాలను నెరవేర్చుట కోసం ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగలయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ ను తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేశామని ఈ యొక్క ట్రస్ట్ కు 108 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి తెలంగాణ రాష్ట్రంలో దేశభక్తి భావాన్ని పెంపొందించే దశ దిశలలో ముందుకు కొనసాగడానికి సంపూర్ణ సహాయ సహకారాలు ఉండాలని ఇట్టి కార్యక్రమాలకు స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలవకుండా అడ్డుపడుతున్నటువంటి దుండగులను కఠినంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలను రూపొందించాలని కొనియాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తెలియజేశారు. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగంలో స్వాతంత్ర సమరయోధుల విలువలు తెలియకుండా మూర్ఖంగా వ్యవహరించిన, పనులను అడ్డుకుంటున్న ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగుల ఛాయాచిత్రాలను, వార్తాపత్రిక నివేదికలను దృష్టిలో ఉంచుకొని జీవిత యావగారా జైలు శిక్ష విధించే విధంగా చట్టాలను రూపొందిస్తేనే ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి చోటుండదని తెలియజేశారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల ఆశయాల కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజలుఅధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *