సుప్రీంకోర్టు తీర్పుపై టి ఎమ్మార్పీఎస్ విజయోత్సవ ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలిపిన- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

న్యూఢిల్లీ, జంతర్మంతర్ వద్ద టి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాదిగల విజయోత్సవ ర్యాలీని విజయవంతం చేసిన టి ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇటుక రాజు మాదిగాను శాలువాతో ఘనంగా సన్మానించిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్, మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ సాయ గౌడ్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లా టి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కోలుపుల రత్నయ్య మాదిగ.ఈ సందర్భంగా బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి టి ఎమ్మార్పీఎస్ విజయోత్సవ ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ టి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఇటుక రాజు మాదిగకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మందకృష్ణ మాదిగతో పాటు 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసిన టి ఎమ్మార్పీఎస్ నాయకులకు ప్రత్యేకంగా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

ఇట్టి తరుణంలో మందకృష్ణ మాదిగ నాయకత్వాన మాదిగల పక్షాన అలుపెరగని పోరాటం చేస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా టి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కోలుపుల రత్నయ్య మాట్లాడుతూ గౌరవనీయులైన మాదిగల పక్షాన మందకృష్ణ మాదిగ చేసిన 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటాన్ని అర్థం చేసుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా టి ఎమ్మార్పీఎస్ ఉద్యమ పోరాటాలకు ఎప్పుడు ముందుంటానని మాదిగల అభివృద్ధికి తోడ్పడుతానని సభా ముఖంగా తెలియజేశారు. ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలో టి ఎమ్మార్పీఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *