అల్లు అర్జున్ ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ ముగించుకుని హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఈ సందర్భంగా వచ్చే వారం నుంచి పుష్ప-2 షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఇతర నటీనటులపై పలు సన్నివేశాలను తెరకెక్కిస్తుండగా, కొత్త షెడ్యూల్లో బన్నీపై క్లైమాక్స్ సీన్లను చిత్రీకరించనున్నారు. డైరెక్టర్తో గొడవపడి అల్లు అర్జున్ ఫారిన్ వెళ్లినట్లు వార్తలు రాగా, చిత్ర బృందం ఖండించిన విషయం తెలిసిందే.