సంగారెడ్డి పట్టణంలో పిరమిడ్ ధ్యానుల ఆధ్వర్యంలో 28 రోజున నిర్వహించే శాఖాహార ర్యాలీని జయప్రదం చేయండి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో ఇన్స్టంట్ పిరమిడ్ ను సందర్శించిన గ్రేట్ మాస్టర్ దామోదర్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా ఆహ్వానం పలికిన బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పత్రీజీ ఆశయాల సాధన మేరకు నిరంతరం ధ్యాన ప్రచారంలో భాగంగా శాఖాహార జగత్ నిర్మాణ ఏర్పాటు కోసం ముందుండి నడిపిస్తున్న గ్రేట్ పిరమిడ్ మాస్టర్ దామోదర్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పిరమిడ్ ధ్యానులందరూ సుభాష్ పత్రీజీ గారి ఆశయాలతో ముందుకెళ్తూ సంగారెడ్డి పట్టణంలో 28వ రోజున జరగబోయే శాఖాహార ర్యాలీని జయప్రదం చేయాలని కోరుతూ శాఖాహార జగత్ నిర్మాణానికి తోడ్పడాలని తెలియజేశారు. అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద పిరమిడ్ క్షేత్రం నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ యొక్క శాఖాహార జగత్ ప్రచార కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పులి సంఘప్ప గౌడ్, పిరమిడ్ మాస్టర్ అశోక్, సాయి కిరణ్ గౌడ్, సైదులు మాస్టర్, ఇన్స్టెంట్ పిరమిడ్ ధ్యానులు మరియు ప్రచారంలో భాగంగా సంగారెడ్డి జిల్లా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *