ఏలూరు స్కూల్‌లో దారుణం..ఓ విద్యార్థిపై మరొకరు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు మరో విద్యార్థి..

విద్యార్థుల మధ్య ఏం జరిగిందో తెలీదు.. ఓ విద్యార్థిపై మరొకరు పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు మరో విద్యార్థి. గాయాలపాలైన ఆ విద్యార్థిని నిర్వాహకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. సంచలనం రేపిన ఈ ఘటన ఏలూరులో చోటు చేసుకుంది.

 

ఉండి మండలానికి చెందిన ఓ బాలుడు ఏలూరులోని జేవియర్ హైస్కూల్‌లో చదువుతున్నాడు. దానికి అనుబంధంగా హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆ గదిలోనే మరో స్టూడెంట్ ఉంటున్నారు. ఇద్దరి మధ్య దోమల చక్రం విషయంలో గొడవ తలెత్తినట్టు తెలుస్తోంది. చివరకు నువ్వెంత అంటే నువ్వెంత అనేస్థాయికి వెళ్లింది.

 

ఓ విద్యార్థి పట్టరాని కోపంతో సీసాతో తెచ్చిన పెట్రోల్‌ని తోటి విద్యార్థిపై పోసి నిప్పుంటించాడు. మంటలు రావడం గమనించిన సీనియర్ స్టూడెంట్స్ వెంటనే మంటలు ఆర్పి నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు. గాయాలపాలైన విద్యార్థి సుధీర్‌పాల్‌ని వెంటనే ఏలూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 

ప్రస్తుతం ఆ విద్యార్థి అక్కడ చికిత్స తీసుకుంటున్నాడు. విద్యార్థి నిలకడగానే ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పెట్రోల్ పోసిన బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

వీరిద్దరి మధ్య చిన్న చిన్న గొడవలే ఈ ఘటనకు దారి తీసిందని తోటి విద్యార్థులు చెబుతున్నమాట. అంతేకాదు పెట్రోల్ పోసిన విద్యార్థి మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. మరి పోలీసులు విచారణలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *