మదనపల్లె ఆర్డీవో ఆఫీసును పరిశీలించిన డీజీపీ..యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌..?

ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీవో కార్యాలయాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన యాక్సిడెంట్ కాదని.. ఇన్సిడెంట్‌లా కనిపిస్తోందన్నారు.

 

‘గత రాత్రి 11.30 గంటలకు మదనపల్లె ఆర్డీవో ఆఫీసులో అగ్నిప్రమాదం జరిగింది. సుమారుగా 3 గంటలపాటు పరిశీలించారం. ఇది యాక్సిడెంట్ కాదు.. ఇన్సిడెంట్‌గా భావిస్తున్నాం. 22ఏ భూముల రికార్డులున్న గదిలో మంటలు చెలరేగాయి. కీలక సెక్షన్‌లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, ఘటనకు సంబంధించిన సమాచారం ఆర్డీవోకు తెలిసింది.. కానీ, కలెక్టర్‌కు తెలియజేయలేదు. స్థానిక సీఐకి తెలిసినా కూడా డీఎస్పీ, ఎస్పీలకు సమాచారం ఇవ్వలేదు. ఈ పరిణామాలు అనుమానాలకు తావిస్తోంది. కార్యాలయంలో షార్ట్ సర్క్యూట్ జరిగేందుకు అవకాశమే లేదు. ఇదే విషయాన్ని ఫోరెన్సిక్ వాళ్లు కూడా స్పష్టం చేస్తున్నారు.

 

ఆర్డీవో ఆఫీసులో కిటికీ బయట అగ్గిపుల్లలు కనిపించాయి. ఆఫీసు బయట కూడా పలు ఫైల్స్ కాలిపోయినట్లు గుర్తించాం. ఇవన్నీ కూడా అనుమానాలను మరింత పెంచుతున్నాయి. ఇటీవల సాక్షాలను నాశనం చేసే ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దిశగా కూడా దర్యాప్తు ప్రారంభించాం. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు 10 బృందాలను ఏర్పాటు చేశాం’ అంటూ ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *