మహావీర్ జయంతి

మహావీర్ జయంతి పురస్కరించుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల మేరకు25/4/2021 తేదీన ఆదివారం నాడు చికెన్, మటన్, చాపల దుకాణాలు, మూసి వేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సెంట్రల్ గవర్నమెంట్ జీవో జారీ చేసిన సందర్భంలో

విజయవాడ పశ్చిమ తాసిల్దార్ మాధురి

ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుండి వన్ టౌన్ చేపల మార్కెట్, చిట్టి నగర్, కబేలా,స్వాతి సెంటర్ ల యందు చికెన్ ,మటన్ మరియు చేపల అమ్మకపు దుకాణాలు మూసి వేయించారు.నిబంధనలకు విరుద్ధంగా షాపులు తెరిచి అమ్మకాలు జరిపిన దుకాణాలు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి లో మూడు కేసులు,భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు తో పాటు అపరాధ రుసుము చెల్లింపు చేయించారు

ఈ కార్యక్రమంలో పశ్చిమ తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది,ఆర్ఐ సత్యనారాయణ, విఆర్ఓ సిరివెన్నెల తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *