గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం లో పాల్గొన్న- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి కోవూరి జ్యోతి…

సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో హనుమాన్ నగర్ కాలనీలో ప్రతి పౌర్ణమిన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరుపబడును. ఇట్టి కార్యక్రమాలను నిర్వహించే హనుమాన్ టెంపుల్ భక్త బృంద కమిటీ పిలుపుమేరకు ఆషాడ మాస గురు పౌర్ణమి పునస్కరించుకొని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ సతీమణి కోవూరి జ్యోతి గారు మరియు దీపక్ బజాజ్ సతీమణి అరుణ బజాజ్ దంపతులు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును పూజారి శివ కోటి పంతులు గారి మంత్రోచ్ఛారణతో విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంలో బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ గురు పౌర్ణమి సందర్భంగా వేద వ్యాసుడిని స్మరించుకుంటూ వేద కాలం నుండి వస్తున్న సంస్కృతిని నేటి తరానికి తెలియజేయడం కోసం గురువుల స్థానానికి విలువనిస్తూ వారి యొక్క ఆశీస్సులు పొందుతూ గురు పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని తెలియజేస్తూ, ఈ కలియుగంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న వారు సుఖ సంతోషాలతో ఉంటారని పండితులు చెబుతున్నారు అందులో భాగంగా గురు పౌర్ణమి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే గురుబలం తోడై ఉన్నత విజయాలకు నాంది పలుకుతుందని తెలియజేశారు. కావున ప్రతి ఒక్కరూ అనాది కాలం నుండి వస్తున్న మన భారతదేశ సంస్కృతిని గౌరవించి మంచి మార్గంలో నడుస్తూ ఉన్నత విజయాలు సాధిస్తూ దేశ సంస్కృతిని కాపాడుతూ భారతదేశానికి మంచి పేరు తీసుకురావాలని కొనియాడారు. ఈ యొక్క కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు సంగారెడ్డి నియోజకవర్గము ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *