మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన సీఎం మోహన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టాలనే ఉద్దేశ్యంతో పాటు జవాబుదారీ చేసేందుకు షాడో క్యాబినెట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోే 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలను కూడా కేటాయించారు.
మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్ పర్యవేక్షిస్తారు. షాడో మంత్రి వర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును కూడా ఆ పార్టీ విడుదల చేసింది.