శవాలతో కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోంది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. శవాలతో సీఎం కేసీఆర్ కుటుంబం రాజకీయాలు చేస్తోందన్నారు. కరోనాతో ప్రజల ప్రాణాలు పోతోంటే రాజకీయాలు చేయటం తగదన్నారు. కేంద్రం తెలంగాణకు అన్ని రకాల సాయం చేస్తోందన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందనటం దురదృష్టకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వరంగల్, కరీంనగర్‌లో సైతం ఆక్సిజన్ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యాక్సిన్ ధరలను కేంద్రం నిర్ణయించదన్నారు. కర్ణాటక, ఒడిషాల నుంచి తెలంగాణకు 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా జరుగుతోందన్నారు. లాక్‌డౌన్, ఆంక్షలపై నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *