రాష్ట్రంలో 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీకి సిద్ధమైన ఏపీ ప్రభుత్వం టెట్ పరీక్షను మరోసారి నిర్వహిస్తుంది. అయితే, జులై 2న టెట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మరింత గడువు ఇవ్వాలంటూ అభ్యర్థులు ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా ప్రభుత్వం స్పందించింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు టెట్, డీఎస్సీలకు సన్నద్ధమయ్యేందుకు మరింత గడువు ఇస్తూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.
ఈ నేపథ్యంలో టెట్ షెడ్యూల్ లో పలు మార్పులతో కూడిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పాత నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉంది.. అయితే వాటిని అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీలో టెట్కు 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం విధితమే.