నీట్ యూజీ పరీక్షను రద్దు చేయలేమని కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పరీక్ష రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. పరీక్ష గోప్యతకు భంగం కలిగినట్లు సరైన ఆధారాలు లేనందున మొత్తం పరీక్షను రద్దు చేయడం సహేతుకం కాదని పేర్కొంది.
పారదర్శకంగా పోటీ పరీక్షల నిర్వహణకు కట్టుబడి ఉన్నట్లు కేంద్రం న్యాయస్థానానికి సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. నీట్ లీకేజీలో నిందితులను అరెస్టు చేశామని.. ఈ అంశంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించామని తెలిపింది. భారీ స్థాయిలో అక్రమాలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు లేవని.. మొత్తం నీట్ పరీక్షను రద్దు చేయడం సరికాదని చెప్పింది.