వైఎస్సార్సీపీ కార్యాలయాల నిర్మాణాల కోసం.. గత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో చేసిన భూ కేటాయింపుల వివరాలను మంత్రి నారా లోకేశ్ X వేదికగా పోస్ట్ చేశారు. జగన్ ప్యాలెస్ లు కట్టుకోవడానికి ఇదేమైనా నీ తాత జాగీరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీ తాత రాజారెడ్డి జాగీరా! వైసీపీ కోసం 26 జిల్లాల్లో 42 ఎకరాలకు పైగా వెయ్యి రూపాయల నామ మాత్రపు లీజుకి 33 ఏళ్లకు కేటాయించుకున్నావు. జనం నుంచి దోచుకున్న రూ.500 కోట్లతో ప్యాలెస్లు కడుతున్నావ్. నీ ఒక్కడి భూదాహానికి కబ్జా అయిన రూ.600 కోట్లకు పైగా విలువైన 42 ఎకరాల్లో 4200 మంది పేదలకు సెంటు స్థలాలు ఇవ్వొచ్చు. నీ విలాసాల ప్యాలెస్ల నిర్మాణానికి అయ్యే రూ.500 కోట్లతో 25వేల మంది పేదలకు ఇళ్లు కట్టి ఇవ్వవచ్చు. ఏంటి ఈ ప్యాలెస్ల పిచ్చి? నీ ధనదాహానికి అంతులేదా?” అని నారా లోకేశ్ ఫైరయ్యారు.